మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ (89) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో పూణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఉదయం 9 గంటలకు చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సన్నిహితులు తెలిపారు. ప్రతిభా పాటేల్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ స్పందించారు. 'దేవిసింగ్ షెకావత్ సామాజిక సేవల ద్వారా సమాజంపై తనదైన ముద్ర వేశారని'అన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్నేత దేవిసింగ్ మృతి పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవర్కూడా సంతాపం వ్యక్తం చేశారు. దేవిసింగ్ షెకావత్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అమరావతి నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గొప్ప విద్యావేత్త. 1972లో ముంబై యూనివర్శిటీ నుంచి ఆయన పీహెచ్డీ చేశారు. అమరావతి తొలి మేయర్గా కూడా ఆయన పని చేశారు. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి భర్తగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు.
ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత
February 24, 2023
0
Tags