శివసేన పేరును, పార్టీ గుర్తును ప్రత్యర్థి, ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాకరే సోమవారం సుప్రీకోర్టును ఆశ్రయించారు. ఏక్నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించడంతో పాటు ఎన్నికల గుర్తు విల్లు బాణం కేటాయించాలని ఎన్నికల సంఘం గతవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో షిండే, 40 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. పలు నాటకీయ పరిణామాల అనంతరం బిజెపి మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ థాకరే !
February 20, 2023
0
Tags