పావురం మెడలో రక్తపు లేఖ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌లో బిధాను పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కథారా గ్రామానికి గురువారం ఓ పావురం ఎగురుకుంటూ వచ్చింది. దాని మెడకు ఉత్తరం వేలాడదీసి ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. అందులో ఉర్దూ భాషలో ఏడు వాక్యాలు రాసి ఉన్నాయి. లేఖ వెనక భాగంలో కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయి. గ్రామస్థులు పావురాన్ని బోనులో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఉర్దూ భాషా పండితుల సాయంతో లేఖలో రాసిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)