మధుమేహం - బాదం పప్పు !

Telugu Lo Computer
0


ప్రతిరోజు బాదం తినడం ద్వారా మధుమేహ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం తేల్చింది. చెన్నైలోని మద్రాసు మధుమేహ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకుల నేతృత్వంలో 400 మందిపై  ఈ అధ్యయనం జరిగింది. అందులో వెల్లడైన వివరాల ప్రకారం వరుసగా 12 వారాల పాటు రోజూ బాదం పలుకులను తింటే- వ్యక్తుల్లో క్లోమం పనితీరు మెరుగుపడుతుంది. ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వల నియంత్రణ మెరుగవుతుంది. శరీర ద్రవ్యసూచీ (బీఎంఐ), బరువులో తగ్గుదల కనిపిస్తుంది. ఊబకాయుల్లో మధుమేహం రాక గణనీయంగా ఆలస్యమవుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉండేందుకూ దోహదపడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)