సమిష్టి ఎజెండాను రూపొందించడం అవసరం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 February 2023

సమిష్టి ఎజెండాను రూపొందించడం అవసరం !


బెంగళూరులో ప్రారంభమైన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ వినియోగదారులు, తయారీదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని, మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించాలని ప్రధాని అన్నారు. మీ చర్చ ప్రపంచంలోని అత్యంత బలహీనమైన పౌరులపై దృష్టి పెట్టాలని తాను కోరుతున్నాని అన్నారు. గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్ ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడం ద్వారా మాత్రమే ప్రపంచ నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందన్నారు. భారతీయ వినియోగదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారు. మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల వైఖరిని అందిస్తారని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోడీ  పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇప్పటికీ ఆ పరిణామాలను ఎదుర్కొంటున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. జీ-20 ఛైర్మన్‌షిప్ సమావేశానికి వచ్చిన గ్లోబల్ జీ-20 గెస్ట్‌లు యుపీఐని ఉపయోగించడానికి అనుమతించే కొత్త ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించామని, ఇది భారత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ అని అన్నారు. ఈ సమావేశంలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల తొలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment