తిరుపతిలో లోకేష్ కు పోలీసుల నోటీసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రతో తిరుపతికి చేరుకున్న లోకేష్ విద్యార్దుల సమస్యలు తెలుసుకునేందుకు సిద్ధమైన తరుణంలో స్ధానిక పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తిరుపతిలో యువగళం పాదయాత్రకు ఇప్పటికే పోలీసుల అనుమతి తీసుకున్నారు. అంకుర ఆస్పత్రి రోడ్డులోని వసతి కేంద్రం వద్ద లోకేష్ కు పోలీసులు నోటీసులు అందించారు. విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పాదయాత్రకు మాత్రమే అనుమతి ఉందన్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతిలో నారా లోకేష్ పాదయాత్రలో నోటీసుల పర్వం కలకలం రేపింది.  పది రోజుల క్రితమే టీడీపీ నేతలు అడ్మిన్ ఎస్పీని కలిసి రూట్ మ్యాప్ అందించారు. అయితే చివరి నిమిషంలో వైసీపీ నేతల ఒత్తిడితోనే పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నగరవీధుల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నేతలు చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)