ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26వ తేదీ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72-600 విమానం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు షిర్డీ చేరుకుంటుంది ఇక, షిర్డీ నుంచి ప్రతీ రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టికెట్ ధర రూ.4,246గా ఉండగా, షిర్డీ నుంచి గన్నవరంకు రూ.4,639గా నిర్ణయించారు.
విజయవాడ - షిర్డీ విమాన సర్వీసులు
February 27, 2023
0
Tags