మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లా లాల్గౌన్ పాలి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు.
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి
February 27, 2023
0
Tags