ఏడాదికోసారి తెరిచే సోమేశ్వరాలయం !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరాన రాయ్‌సెన్‌ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం శనివారం తెరుచుకోనుంది. ఏడాది పొడవునా మూసి ఉంచే ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజున మాత్రమే తెరవడం ఈ ఆలయం ప్రత్యేకత. వెయ్యి అడుగుల ఎత్తయిన కొండపై ఉన్న ఈ శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించగా, పలువురు ముస్లిం రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని సామాన్య ప్రజల కోసం తెరవాలంటూ 1974లో ఉద్యమం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్‌ సేథీ సోమేశ్వరాలయం శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతించారు. ప్రస్తుతం పురావస్తుశాఖ నిర్వహణలో ఉన్న ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలపాటు తెరుస్తారు. శనివారం నాటి పర్వదినానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)