ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 26వ తేదీన విచారణకు హాజరు కావాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ బడ్జెట్ రూపకల్పన సందర్భంగా తాను సీబీఐ విచారణకు హాజరుకాలేనని, ఫిబ్రవరి చివరలో విచారణకు సహకరిస్తానని నిన్న తెలిపారు. సిసోడియా విజ్ఞప్తి మేరకు ఈనెల 26న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను విచారణకు హాజరు కాలేనని మనీశ్ సిసోడియా సీబీఐకి చెప్పారు. తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. బడ్జెట్ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా తన కర్తవ్యమని, ఇది ఢిల్లీకి ముఖ్యమైన సమయమని చెప్పారు. దీని కోసం తాను 24 గంటలు పని చేస్తున్నాన్న మనీశ్ సిసోడియా.. తానేమీ పారిపోవాలని గడువు అడగడం లేదని వివరించారు. విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని, ఇప్పుడు మాత్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరారు.
Post Top Ad
adg
Monday, 20 February 2023
Home
26వ తేదీన విచారణకు హాజరు కావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం
విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని
26వ తేదీన విచారణకు హాజరు కావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
26వ తేదీన విచారణకు హాజరు కావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
Tags
# 26వ తేదీన విచారణకు హాజరు కావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
# ఢిల్లీ లిక్కర్ స్కాం
# విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని
About Telugu Lo Computer
విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని
Tags
26వ తేదీన విచారణకు హాజరు కావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు,
ఢిల్లీ లిక్కర్ స్కాం,
విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment