కోల్ కతాలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దేశంలో ప్రధాని పోస్టు ఖాళీగా లేదని, దేశ ప్రజలు ఈసారి కూడా మోడీవైపే ఉన్నారని అన్నారు. పేద, గ్రామీణ ప్రజలు, యువత దేశాన్ని నడిపించే బాధ్యతను మోడీపై ఉంచారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంటాయనుకోవడం పొరపాటేనని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల అన్నారు. రానున్న ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీకి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని చెప్పారు.
ప్రధాని సీటు ఖాళీగా లేదు !
January 15, 2023
0