వీడియో కాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్కు బాంబే హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతని అరెస్ట్ చేసేందుకు సిబిఐ పేర్కొన్న కారణం చాలా సాధారణమైనదని న్యాయమూర్తులు రేవతి మోహితే, పి.కె. చవాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దరాప్తు సంస్థలు (సిబిఐ) తమ ఇష్టానుసారం నిందితులను అరెస్ట్ చేయలేరని పేర్కొంది. రిమాండ్ దరఖాస్తుతో పాటు కేసు డైరీని పరిశీలించేందుకు ఎలాంటి తీవ్రమైన ప్రయత్నాలు చేయలేదని పేర్కొంది. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ మోసం కేసులో గతేడాది డిసెంబర్ 6న సిబిఐ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
వేణుగోపాల్ ధూత్కు మధ్యంతర బెయిల్
January 20, 2023
0
Tags