దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 1,74,467 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 179 మందికి కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,936కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,30,726కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.16 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)