మోసపోయిన ఆర్ఎంపీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తమ్మలూరు గ్రామానికి చెందిన సీతారామ స్వామి ఆర్ఎంపీగా ముండ్లమూరు గ్రామంలో స్థిరపడ్డారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తి వైద్యం కనుక ప్రవృత్తిగా అందరితో కలిసి మెలసి ఉంటాడు. ఇలా అనుకోకుండా గత ఏడాది ఏప్రిల్ నెలలో చికిత్స కోసం కంజులు పట్టుకొని అమ్ముకొని బతుకుతెరువు సాగించే దంపతులు ఆయన వద్దకు వచ్చారు. తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయాలని, ఆ భార్యా డాక్టర్ ను కోరింది.ఆ దంపతులు వైద్యం కోసం ఒక నెలలోనే నాలుగుసార్లు వైద్యుడ్ని కలిశారు. వైద్యం కోసం వచ్చినప్పుడల్లా, కంజుపిట్టలని ఫ్రీగా ఇచ్చేవారు. ఇలా వారివురి మద్య సంబంధాలు మెరుగుపడటంతో ఆ దంపతులు, డాక్టర్ సీతారామ స్వామి వద్ద ఓ విషయాన్ని చెప్పారు. తమ బంధువుల పిల్లోడు కేరళలో ప్రొక్లెయిన్​ ఆపరేటర్​గా పని చేస్తుంటాడని, అతనికి అనుకోకుండా కొంత బంగారం దొరికిందని, ఆ అబ్బాయికి భయమేసి బంగారాన్ని అమ్మిపెట్టమని కోరాడని వైద్యుడికి వివరించారు. ఆ దొంగ బంగారాన్ని ఎక్కడ అమ్మాలన్నా ఇబ్బందిగా ఉందని, మీరు తీసుకునే పనైతే తక్కువ ధరకు ఇప్పిస్తామని వారు చెప్పారు. దీంతో ఆర్ఎంపీ ముఖం వెలిగిపోయింది. ఆ బంగారాన్ని తనకే ఇవ్వాలని, మీరు బయట ఎక్కడ అమ్మినా ప్రమాదమని హెచ్చరించాడు. దీంతో ఒకరికొకరు విశ్వాసం నెలకొల్పే మాటలు మాట్లాడుకున్నారు. డబ్బులు సిద్దం చేసుకుంటే. ఆ బంగారాన్ని తమకే ఇచ్చేస్తామని, ఆ దంపతులు చివరిమాటలుగా చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తరువాత చౌకగా వస్తున్న ఆ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు సుమారు 20 లక్షల రూపాయలు సిద్ధం చేసుకున్న ఆర్ఎంపీ, ఆ దంపతులు ఇచ్చి వెళ్లిన చారవాణికి ఫోన్ చేశాడు. వారు వెంటనే స్పందించి బంగారంతో తాము సిద్దంగా ఉన్నామని మీరు డబ్బు తీసుకొని చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, బి.కొత్త కోట వీరంగి చెరువు వద్దకు వస్తే మీకు బంగారం ఇచ్చేస్తామని తెలిపారు. దీంతో ఆ ఆర్ఎంపీ తన బంధువును వెంట బెట్టుకొని వారు చెప్పిన చోటుకు వెళ్లారు. పథకం ప్రకారం ముందే అక్కడ ఉన్న యువకుడు వీరు వెళ్ళగానే ఓ మూటతో వచ్చి సంచిలో నుండి ఓ బంగారు పూసను తీసి పరిశీలించమని చెప్పాడు. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని యువకుడు ఇచ్చిన బంగారుపూసని పరిశీలించి నమ్మకం కుదిరాక డబ్బు అతని చేతికిచ్చాడు. ఆ యువకుడు అతని వద్ద ఉన్న బంగారు పూసల దండలున్న మూటను వారికిచ్చి ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదంటూ, పోలీసులు తిరుగుతున్నారని, మీరు తొందరగా వెళ్లిపోవాలని జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ మూటను తీసుకొని ఇంటికి వచ్చి, విప్పదీసి చూస్తే అది నకిలీ బంగారం అని వైద్యుడు గుర్తించారు. వెంటనే తాను ఫోన్ చేసిన నెంబర్ కు ఫోన్ చేయగా, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్ని సార్లు చేసిన ఫోన్ నుంచి స్పందన లేకపోవడంతో సీతారామ స్వామి తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఈ నెల 9వ తేదీన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ని కలసి తన గోడును వినిపించుకున్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)