పుట్టినరోజు వేడుకల్లో తుపాకీ కాల్పులు !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఫతేపూర్ బేరిలోని జోనాపూర్ గ్రామంలో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుక జరుగుతోంది. ఆ పార్టీకి పలువురు యువకులు హాజరయ్యారు. ఆ సమయంలో ప్రమోద్ అనే వ్యక్తి ముఖంపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ప్రమోద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాంపాల్ అనే వ్యక్తి తుపాకీతో వచ్చి ప్రమోద్ వైపు 7-8 రౌండ్ల కాల్పులు జరిపాడని ఓ సాక్షి తెలిపాడు. ''పుట్టినరోజు వేడుక జరుగుతుండగా రాంపాల్ అనే వ్యక్తి కొంత మందితో అక్కడకు వచ్చాడు. టెర్రస్ మీదకు వెళ్లి ప్రమోద్ వైపునకు కాల్పులు జరిపాడు'' అని ప్రమోద్ సోదరుడు వినోద్ చెప్పాడు. ఆ బుల్లెట్లు ప్రమోద్ కు తగలలేదని అన్నాడు. కాల్పులు జరపకూడదని ప్రమోద్ అన్నాడని, అయితే, టెర్రస్ పై నుంచి కిందకు వచ్చాక రాంపాల్ మరోసారి కాల్పులు జరపడంతో ప్రమోద్ ముఖంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లిందని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబడుతున్నారు. ప్రమోద్ కు తీవ్రగాయాలు కావడంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)