ఆస్తి కోసం తల్లిని చంపిన తనయుడు !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్ లో  ముఖేష్ యాదవ్, షీలా దేవి అనే తల్లీకొడుకు నివాసం ఉంటున్నారు. ముఖేష్ యాదవ్ స్థానికంగా పని చేసుకుంటూ తల్లికి చూసుకుంటూ ఉండేవాడు.వీరికి పూర్వికుల నుంచి వచ్చిన కొంత భూమి ఉంది. అయితే తల్లి అదే భూమిని ఇటీవల అమ్మింది. అమ్మగా వచ్చిన డబ్బులను ఇవ్వాలని కుమారుడు ముఖేష్ యాదవ్ తల్లితో గత కొంత కాలంగా గొడవ పడుతున్నాడు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ముఖేష్ యాదవ్ ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లిపై దాడికి పాల్పడి అక్కిడి నుంచి పరారయ్యాడు. కుమారుడి దాడిలో తల్లి మడుగులో కొట్టుమిట్టాడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు షీలా దేవి చివరికి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)