భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్థంతిని దేశవ్యాప్తంగా 'మహా పరినిర్వాన్ దివస్'గా నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు గుర్తు చేసుకొన్నారు. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు నివాళులు అర్పించారు. ''మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించాను. ఆయన లక్షల మందిలో ఆశలు చిగురించేందుకు శ్రమించారు. భారత్ ఎన్నటికీ మర్చిపోలేని ఆదర్శప్రాయమైన రాజ్యాంగాన్ని అందించేందుకు కృషి చేశారు'' అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. స్పీకర్ ఓం బిర్లా కూడా అంబేడ్కర్కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.''సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ ఉండేలా ప్రజాస్వామ్య సాధికారతకు అవసరమైన అమూల్యా రాజ్యాంగాన్ని అందించారు'' అని పేర్కొన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు కూడా పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ కు అంబేద్కర్ ఘన నివాళి !
December 06, 2022
0
Tags