అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రాణాలు పోయాయి !

Telugu Lo Computer
0


కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో 33 ఏండ్ల వయసున్న ప్రీతి కుష్వా ఈ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త మరో ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. అయితే ప్రీతికి 11 నెలల పాప ఉంది. డిసెంబర్ 10వ తేదీన మెడికల్ చెకప్ చేసుకోగా, ప్రెగ్నెన్సీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే తనకు ప్రస్తుతం 11 నెలల బేబీ ఉందని, ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంది. ఈ క్రమంలో అబార్షన్ ట్యాబ్లెట్ తీసుకురమ్మని భర్తకు చెప్పింది. కానీ అతను తిరస్కరించాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆ ట్యాబ్లెట్‌ను తెప్పించుకుని వేసుకుంది. అనంతరం ఆమె తీవ్ర రక్తస్రావానికి గురైంది. హాస్పిటల్‌కు వెళ్దామని భార్యను భర్త అడిగాడు. హాస్పిటల్‌కు వచ్చేందుకు ప్రీతి అంగీకరించలేదు. కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన భర్త ప్రీతిని ఆస్పత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ పిల్ వేసుకోవడం కారణంగానే తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయిందని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)