త్రిపుర కాంగ్రెస్ నేతలకు టీఎంసీ తీర్థం !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో త్రిపుర కాంగ్రెస్ సీనియర్ నేత పిజూష్ కాంతి బిశ్వాస్, మరో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. త్రిపురలోని 60 మంది సభ్యుల శాసనసభకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో దేశ రాజధానిలోని పార్టీ కార్యాలయంలో టీఎంసీలో చేరారు.త్రిపురలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడిగా బిశ్వాస్‌ను నియమించే అవకాశం ఉందని పార్టీ నేత ఒకరు తెలిపారు. టీఎంసీలో చేరిన కాంగ్రెస్ నాయకుల్లో తేజెన్ దాస్, అనంత బెనర్జీ, త్రిపుర పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణితా చక్మా, త్రిపుర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సమరేంద్ర ఘోష్ ఉన్నారు.పార్టీలోకి సీనియర్ నాయకులను స్వాగతిస్తూ త్రిపుర టీఎంసీ యూనిట్ ట్వీట్ చేసింది.త్రిపురలో బీజేపీ దుష్పరిపాలనపై, కాషాయ శక్తులు సాగిస్తున్న బీభత్సంపై మేం కలిసి పోరాడతామని అభిషేక్ బెనర్జీ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)