మధ్యప్రదేశ్లోని బైతూల్ జిల్లాలోని మండవి గ్రామంలో 8 ఏళ్ల తన్మయ్ దియావర్ అనే బాలుడు ఆడుకుంటూ 400 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తన్మయ్ 60 అడుగుల వద్ద ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. బాలుడికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపు పంపించారు. తాడు సహాయంతో పైకి లాగే ప్రయత్నం చేయగా, 12 అడుగుల వరకు వచ్చాక తాడు తెగిపోయింది. దీంతో పొక్లెయిన్లతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. మరోవైపు, అధికారులు ఏర్పాటుచేసిన సాధనం ద్వారా తండ్రితో మాట్లాడిన బాలుడు ''నాన్నా.. ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది. నన్ను త్వరగా బయటకు తీయండి'' అని వేడుకోవడం అక్కడివారిని కదిలించింది.
నాన్నా.. ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది !
December 08, 2022
0
Tags