తెలంగాణలో ప్రజలకే కాదు - రాళ్లకూ పవర్‌ ఉంటుంది !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్రంపై  విషం కక్కుతున్నారని, ఎమ్మెల్యేలను బేరమాడేందుకు స్వామీజీలను పంపుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టుల గురించి ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా రాష్ట్ర మంత్రులు వెళ్లినా కనికరించని ప్రధాని, షర్మిలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. వార్డు మెంబర్‌ కూడా కాని షర్మిలకు ప్రధాని ఫోన్‌ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వైయస్ షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ఇద్దరు కూడా తెలంగాణ ద్రోహూలేనని అన్నారు. మానుకోట, రాళ్లకు మరోసారి పని చెప్పకండీ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మా కంటే మానుకోట రాళ్లకు ఎక్కువ పౌరుషం వుంటుందన్న మంత్రి,  నోరు..నాలిక అదుపులో పెట్టుకోని షర్మిల పాదయాత్ర చేసుకోవాని హితవు పలికారు. కేసీఆర్‌ను తక్కువచేసి మాట్లాడితే తెలంగాణలోని ప్రజలకే కాదు రాళ్లకూ పవర్‌ ఉంటుందని తెలుసుకుని ఆమె మాట్లాడితే మంచిదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)