తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీన్ పేటకు చెందిన ర్యాగల రవళికి నిజామాబాద్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. నేడు మ.12:15 గంటలకు ఇద్దరికి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏమైందో ఏమో గానీ ఆ యవతి బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో ఇంట్లోని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ముందు రోజు డ్యాన్స్ లు వేసి ఉత్సాహంగా ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడం బంధువులను విస్మయానికి గురిచేసింది. కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవల్సిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కాబోయే పెళ్ళికొడుకే తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికి ముందుగానే కొన్ని షరతులు పెట్టి మానసిక క్షోభకు గురిచేయడంతో చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జాబ్ విషయంలో, ఆస్తి విషయంలో వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వధువు ఆత్మహత్య !
December 11, 2022
0
Tags