తెలంగాణలోని మహబూబ్నగర్ లో పార్టీ కార్యాలయం, కలెక్టరేట్ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ''ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనకు సాటి ఎవరూ లేరు. గతంలో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ తెలంగాణ కోరుకున్నామో ఆ బాటలో ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యం. జీవితానికి అదే పెద్ద పెట్టుబడి, సంతృప్తి. గురుకులాలను 3, 4 రెట్లు పెంచుతాం. కంటివెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదు'' అని వివరించారు.
ఏ తెలంగాణ కోరుకున్నామో ఆ బాటలో ఉన్నాం !
December 04, 2022
0
Tags