ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరిమితిని పెంచితే వినియోగదారుల దగ్గర ఖర్చు చేయదగ్గ ఆదాయం మిగులుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపాయి. ప్రస్తుతం రూ.2.5లక్షల ఆదాయం వరకు ఇన్ కమ్ ట్యాక్స్ లేదు. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలు, 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉంది.
ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు ?
December 30, 2022
0
Tags