ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన డాక్-1 మాక్స్ దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్లో 18 మంది పిల్లలు చనిపోయిన ఘటనపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణల క్రమంలో డాక్-1 మాక్స్ తయారీని ఆపేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ కలిసి దర్యాప్తు చేపడుతాయన్నారు. ఫార్మా కంపెనీని తనిఖీ చేశాక.. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు కంపెనీకి వెళ్లి శాంపిల్స్ సేకరించి చండీగఢ్లోని రీజినల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి పంపించారన్నారు. డాక్-1 మ్యాక్స్ సిరప్ యూపీ నుంచి కేవలం ఉజ్బెకిస్తాన్కే ఎగుమతి అయినట్టు గుర్తించామన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, 10 ఏండ్లుగా సేవలు అందిస్తున్నామని మరియన్ బయోటెక్ లీగల్ ప్రతినిధి హసన్ హార్రీస్ తెలిపారు. గవర్నమెంట్ రిపోర్టు వచ్చే దాకా తయారీని నిలిపేసినట్టు వివరించారు.
డాక్-1 మాక్స్ దగ్గు మందు ఘటనపై దర్యాప్తునకు ఆదేశం
December 30, 2022
0
Tags