వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు. 'వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్పీజీ కనెక్షన్లు, స్టౌవ్ ఇచ్చారు. కానీ, సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉండటమే. ఉజ్వల స్కీంలో నమోదు చేసుకున్న నిరుపేదలకు రూ.500లకే ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం.' అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Post Top Ad
adg
Monday, 19 December 2022
Home
rajastan
అశోక్ గెహ్లట్ ప్రకటన
ఉజ్వల పథకంలో వున్న వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్
ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం
ఉజ్వల పథకంలో వున్న వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ !
ఉజ్వల పథకంలో వున్న వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ !
Tags
# rajastan
# అశోక్ గెహ్లట్ ప్రకటన
# ఉజ్వల పథకంలో వున్న వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్
# ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం
About Telugu Post
ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం
Tags
rajastan,
అశోక్ గెహ్లట్ ప్రకటన,
ఉజ్వల పథకంలో వున్న వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్,
ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment