కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు మూడేళ్ళ క్రితం రద్దు చేసిన రాష్ట్ర హోదాను పునరుద్ధరంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. భారతదేశంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి దాని రెండవ ప్రధాన నిర్ణయం అయిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ వైపు మార్గం" అనే అంశంపై మాట్లాడుతూ సీతారామన్ సూచనప్రాయంగా ఈ విషయం తెలిపారు. కొంత సమయం పట్టినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పునరుద్దరణ జరుగుతుందన్నారు.
జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ?
November 06, 2022
0