సెమీస్‌కు పాకిస్తాన్

Telugu Lo Computer
0


టీ 20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ అద్భుత విజయాన్నిఅందుకోని సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ అఫ్రిది 4 వికెట్లతో చెలరేగగా షాదబ్ ఖాన్ 2 వికెట్లతో రాణించాడు. బంగ్లా బ్యాటింగ్‌లో నజ్ముల్ షాంటో (48 బంతుల్లో 54; 7 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేసాడు. సౌమ్య సర్కార్ (20), చివర్లో అఫిఫ్ హుస్సేన్ (20 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు బాబర్ ఆజమ్ (25), రిజ్వాన్(32) శుభారంభం చేశారు. ఆ తర్వాత మహమూద్ హరీష్ (31), షాన్ మసూద్ (24) ధాటిగా ఆడడంతో లక్ష్యాన్ని అలవోకగా చేధించారు.వరుసగా విఫలమవుతున్న బాబర్ ఆజమ్ టచ్‌లోకి రావడం, టోర్నీలో ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపని షాహీన్ అఫ్రిదీ నాలుగు వికెట్లు తీయడం పాకిస్థాన్‌కు సెమీస్ ముందు శుభపరిణామం.

Post a Comment

0Comments

Post a Comment (0)