క్రైమ్‌ షోలు చూసి కుటుంబ సభ్యులను చంపాడు !

Telugu Lo Computer
0


త్రిపురలోని ధలాయ్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతోంది. ఈ క్రమంలో తాత, తల్లి, సోదరి, అత్తమ్మలను గొడ్డలితో దాడి చేసి ఓ బాలుడు దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని ఆదివారం ఉదయం మార్కెట్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశాం. నేరానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయి కనిపించింది. మృతదేహాలు సమీపంలోని బావిలో పడేశాడు.' అని త్రిపుర పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీవీకి బానిసయ్యాడని, తరుచూ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ షోలు చూస్తుంటాడని స్థానికులు తెలిపారు. గతంలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ హత్యలు చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్‌ పెంచి మ్యూజిక్‌ ప్లే చేసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)