రైలు ఢీకొని ముగ్గురు పిల్లల మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 27 November 2022

రైలు ఢీకొని ముగ్గురు పిల్లల మృతి


పంజాబ్ లోని శ్రీ కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో ప్యాసింజర్ రైలు రోడ్డు దాటుతున్న ముగ్గురు పిల్లలపై నుంచి వెళ్లడంతోవారు అక్కడికి అక్కడే మరణించారు. సట్లెజ్ నదిపై వంతెన సమీపంలో రైలు ట్రాక్‌కు సమీపంలో నలుగురు వలస కూలీల పిల్లలు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో మరో బాలుడికి గాయాలు కావడంతో, అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పిల్లల వయస్సు  7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దుర్ఘటనపై పంజాబ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కోరారు. శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment