ఢిల్లీలో 'ఆజ్తక్, ఇండియా టుడే' చానల్ నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ విచ్ఛిన్నకారులపై కలాన్ని ఎక్కుపెట్టాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది నుంచి సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి 'భారత్ జాగృతి ఫౌండేషన్-ఇండియా టుడే' సంయుక్తంగా సాహిత్య పురస్కారం అందజేస్తాయని ప్రకటించారు. దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మంచి వాతావరణాన్ని కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉందన్నారు. సాహిత్య ప్రేమికురాలిగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు.
విచ్ఛిన్నకారులపై కలాన్ని ఎక్కుపెట్టండి !
November 21, 2022
0
Tags