మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్

Telugu Lo Computer
0


గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణ హోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అహ్మదాబాద్ జిల్లా నరోడా స్థానం నుంచే మనోజ్ కుమార్తె పాయబ్ కుక్రాణిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. నరోడా పాటియా అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో దోషులుగా తేలిన 16 మందిలో మనోజ్ కుక్రాణి ఒకరు. మనోజ్‌తోపాటు మరో 15 మంది దోషులకు కింది కోర్టు విధించిన శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా 2018 లో సమర్థించింది. మనోజ్ కుక్రాణి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. నరోడా సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎ బలరాం తవానీని పక్కనబెట్టి పాయబ్‌కు బిజెపి టికెట్ ఇవ్వడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)