రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?

Telugu Lo Computer
0


కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు టైమ్స్‌ నౌ సదస్సులో కొలీజియం సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ వ్యవస్థ తీరును తప్పుపట్టారు. రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఏ నిబంధనలో కొలీజియం వ్యవస్థ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. 1991 వరకు జడ్జీలను ప్రభుత్వమే నియమించేదని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో రిజిజు ప్రసంగిస్తూ కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి రెండు స్తంభాలని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)