తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను జైలు అధికారి కలిసిన వీడియోను బీజేపీ శనివారం విడుదల చేసింది. శనివారం విడుదల చేసిన వీడియోలో మంత్రి తోటి ఖైదీలు, జైలు అధికారితో దర్బార్ నిర్వహించడం సంచలనం రేపింది.) జైలులో ఖైదీతో మసాజ్ చేయించుకోవడం, బయటి నుంచి లగ్జరీ భోజనం తెప్పించుకొని తిన్న వీడియోల అనంతరం బీజేపీ తాజాగా సత్యేందర్ కా దర్బార్ అంటూ బీజేపీ జైలు వీడియోను విడుదల చేయడం విశేషం. జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ ను రాత్రి 8 గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్ పరామర్శించారని భారతీయ జనతా పార్టీ వెల్లడించింది. బీజేపీ విడుదల చేసిన కొత్త వీడియోలో సత్యేందర్ జైన్ సెల్లోని పలువురు ఖైదీలతో కలిసి మాట్లాడుతున్నపుడు సూపరింటెండెంట్ జైలు గదిలోకి ప్రవేశించారు.సందర్శన గంటల తర్వాత ఫుటేజీ సెప్టెంబర్ నాటిది. మంత్రి జైన్కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు జైలు అధికారి అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు''తీహార్కి సంబంధించిన మరో వీడియోను మీడియా బయటపెట్టింది. ఈసారి సత్యేందర్ కా దర్బార్ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు''అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జై హింద్ ట్వీట్లో తెలిపారు.
సత్యేందర్ జైన్పై మూడో వీడియో విడుదల చేసిన బీజేపీ !
November 26, 2022
0
Tags