దేశంలో కొత్తగా 811 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 811 కోవిడ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,952కి చేరింది. ప్రస్తుతం 13,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,41,18,882 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,511కి చేరింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.75 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)