గుజరాత్లో మంగళవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుండి ముంబై సెంట్రల్కు వెళ్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 54 ఏళ్ల మహిళ మరణించింది. బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్ అనే మహిళ ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గత నెల రోజుల్లో ఈ వందే భారత్ రైలు ఢీకొని ట్రాక్పై పశువులు మృత్యువాత పడిన ఘటనలు మూడు జరిగాయి. గత నెలలో వత్వా , మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెల మందను ఢీకొనడంతో రైలు ముందు ప్యానెల్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరుసటి రోజు (అక్టోబర్ 7) ఆనంద్ సమీపంలో రైలు ఒక ఆవును ఢీకొట్టింది. మరో ఘటనలో గుజరాత్లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది.
మహిళను ఢీకొన్న వందే భారత్ రైలు
November 09, 2022
0