'వందే భారత్ ఎక్స్ప్రెస్' రైలు వరుసగా అవాంతరాలు ఎదురౌతున్నాయి. మరోసారి రైలు ఆగిపోయింది. ఈ సారి రైలు చక్రం ఆగిపోయిన కారణంగా నిలిచిపోయింది. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న 'వందే భారత్ ఎక్స్ప్రెస్' రైలు డంకౌర్-వయా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా, సీ8 కోచ్కు సంబంధించిన చక్రం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. చక్రం మోటార్ లోపం కారణంగా రైలు ఆగిపోయింది. దీంతో అధికారులు రైలును నిలిపివేశారు. నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమస్యను గుర్తించారు. రైలును 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టషన్కు తీసుకెళ్లారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పడుతుండటంతో ప్రయాణికులను శతాబ్ది ఎక్స్ప్రెస్లోకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.
'వందే భారత్ ఎక్స్ప్రెస్' కు అవాంతరాలు !
October 08, 2022
0
Tags