మహిళను చెంప మీద కొట్టిన మంత్రి !

Telugu Lo Computer
0


కర్ణాటక మౌళిక సదుపాయాల మంత్రి, బీజేపీకి చెందిన వీ సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో భూమి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి హజరయ్యారు. అర్హులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. అయితే తనకు పట్టా రాలేదని మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన మహిళపై సోమన్న చెంపపై కొట్టారు. ఆ తరువాత సదరు మహిళ మంత్రి కాళ్లను మొక్కింది. ఈ ఘటన అనంతరం సోమన్న, సదరు మహిళకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దేవాదాయ శాఖ కింద తనకు ప్లాటు మంజూరు చేయలేదని మహిళ, మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన సందర్భంలో మంత్రి సోమన్న మహిళను కొట్టారు. కర్ణాటకలోని బీజేపీ మంత్రులు ఇలాంటి ఘటనల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్ నెలలో న్యాయశాఖ మంత్రి జేసీ మధు స్వామి కూడా ఓ మహిళ రైతుతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 3న బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, తన ఆస్తిని కూల్చడాన్ని వ్యతిరేకించిన మహిళను బెదిరించి, దుర్భాషలాడిన వీడియో కూడా వివాదాస్పదం అయింది. అంతకుముందు కర్ణాటకలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ ను జేడీయూ నాయకుడు చెంపదెబ్బ కొట్టడం వివాదం రాజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)