ఆంధ్రప్రదేశ్ లో విశాఖ రాజధానిగా కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాల్లోనీ పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు మానవహారాలు జరుపుతున్నారు. చోడవరం నియోజకవర్గంలో తాజాగా ప్రజలు పెద్ద ఎత్తున విశాఖ రాజధానికి మద్దతుగా కదం తొక్కారు. భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి విశాఖ ను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికే విశాఖ రాజధానికి మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలకు ఇచ్చారు. మూడు రాజధానులు జగన్ కోరుకున్న అభివృద్ది శంఖారావమని స్పీకర్ తమ్మినేని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటానికే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారన్నారు. భూమి కోసం, భుక్తికోసం, నిరుపేదల హక్కుల కొసం పొరాడిన నేల ఉత్తరాంధ్రని, సిఎం జగన్మోహాన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని స్పీకర్ కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు. మూడు రాజధానులు వర్దిల్లాలని ముందుకు వెళతామని తమ్మినేని ప్రకటించారు. తాళి కట్టిన ఆడది , మొలతాడుకట్టిన మగాడు , మీసం మొలిసిన యువకులంతా యువకులు రొడ్లు మీదకు రావలసిందేనన్నారు. అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు.
అమరావతి అంటే తరిమికొట్టాలి !
October 13, 2022
0
Tags