పుష్పకు ''ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డు

Telugu Lo Computer
0


ఢిల్లీ వేదికగా సీఎన్‌ఎన్‌ న్యూస్‌-18 ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన 'ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' ఈవెంట్‌లో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో పాటు టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ సహా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా సినిమా పుష్ప: ది రైస్‌ సినిమాకు ''ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డు అందుకోగా, ఆ తర్వాత క్రీడా విభాగంలో నీరజ్‌ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు. నీరజ్‌ చోప్రా, అల్లు అర్జున్‌లు ఒకే వేదికను పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే నీరజ్‌ చోప్రా అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ 'తగ్గేదే లే' మేనరిజంను చేసి చూపించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరు కలిసి తగ్గేదే లే అంటూ ఫోజిచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టాడు నీరజ్‌ చోప్రా. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.





Post a Comment

0Comments

Post a Comment (0)