సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్ గా డివై చంద్రచూడ్ ను సిఫారసు చేస్తూ ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. జస్టిస్ యూయూ లలిత్ తన వారసుడిగా చంద్రచూడ్ పేరిట సిఫార్సు లేఖను అందజేయడానికి సీజేఐ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సిఫారసు లేఖను కేంద్ర న్యాయశాఖ మంత్రికి పంపించారు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారిగా వేడుక ఫోటోగ్రాఫ్లను ప్రజలకు విడుదల చేశారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సిఫారసు లేఖ అందజేయడాన్ని కూడా సుప్రీం బహిరంగపర్చింది.
సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ ను సిఫారసు చేసిన యూయూ లలిత్
October 11, 2022
0