బద్రీనాథ్, కేదార్నాథ్లను ముకేశ్ అంబానీ ఈరోజు సందర్శించారు. ఉదయం బద్రీనాథ్కు చేరుకున్న ముకేశ్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. బద్రీ కేదార్ ఆలయ కమిటీకి ఆయన 5 కోట్లు విరాళం ఇచ్చారు. బద్రీనాథ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిశోర్ పన్వర్ స్వాగతం పలికారు. బద్రీనాథ్లో జరిగిన గీతా పాఠ్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన కేదార్నాథ్ చేరుకున్నారు.
అంబానీ బద్రీనాథ్, కేదార్నాథ్ సందర్శన !
October 13, 2022
0
Tags