పిల్లలతో క్షుద్ర పూజలు

Telugu Lo Computer
0


ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, నరమాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని మలయాళపుజా పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్ర పూజలు చేస్తున్నది. చిన్న పిల్లలను తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు శోభనకు వ్యతిరేకంగా గురువారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆమెపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తున్న ఆ మహిళను అరెస్ట్‌ చేసే వరకు ఆందోళనలు విరమించబోమని భీష్మించారు. దీంతో డీఎస్పీ ఆదేశాలతో మంత్రగత్తె శోభనను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగించడంపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)