ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వడ్డేశ్వరంలో తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన యశ్వంత్‌రెడ్డి వడ్డేశ్వరంలోని కెఎల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్సిటీ హాస్టల్లో ఉంటూ తరగతులకు హాజరవుతున్నాడు. దసరా సెలవుల అనంతరం సోమవారం రాత్రి వర్సిటీకి వచ్చాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో వర్సిటీ భవనంపై నుండి యశ్వంత్‌రెడ్డి కిందకి దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను వర్సిటీ యాజమాన్యం హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)