బుల్లెట్ బండి కోసం ఆత్మహత్య - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 12 October 2022

బుల్లెట్ బండి కోసం ఆత్మహత్య


సుష్మా అనే మహిళ తన ఇద్దరు కుమారులు పీయూష్‌, పరాస్‌ తో కలిసి నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జీవిస్తున్నారు. పీయూష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, 18ఏళ్ల పరాస్‌ కాలికి పక్షవాతం రావడం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా తల్లిని బుల్లెట్‌ బైకు, మొబైల్‌ ఫోను కొనివ్వాలని అడుగుతున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపం చెందిన పరాస్‌, గదిలో ఫాన్‌కు ఉరేసుకున్నాడు. తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే పరాస్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏడాది క్రితం సైకిల్‌ కొనివ్వందుకు అలిగిన పరాస్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment