కూరగాయల మార్కెట్లో నిర్మలా సీతారామన్ !

Telugu Lo Computer
0


చెన్నై నగరంలోని మైలాపోర్ ఏరియాలోని ఓ కూరగాయల మార్కెట్ కు నిర్మలా సీతారామన్ వెళ్లారు. మార్కెటంతా కలియ తిరుగుతూ అక్కడి కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. వ్యాపారం ఎలా నడుస్తోందని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కందగడ్డ, కాకరకాయలు కొనుగోలు చేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ప్రజలకు నిత్యావసర సరుకులైన కూరగాయలపై కేంద్రమంత్రి దృష్టి పెట్టినట్లున్నారని కొంతమంది అంటుండగా, నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లినట్లున్నారని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)