కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ కాన్వాయ్‌ జనగాం జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకోగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్‌కు శాలువ కప్పి స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ కదులుతుండగా మహిళా కానిస్టేబుల్ కాన్వాయ్‌లోని ఓ కారులో ఎక్కుతుండగా జారిపడిపోయింది. అయినప్పటికీ.. కాన్వాయ్‌ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌ నేడు హన్మకొండ జిల్లాలోని దామెర క్రాస్‌రోడ్, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)