నావికాదళానికి చెందిన మిగ్ 29కే విమానం బుధవారం కుప్పకూలింది. సాధారణ సార్టీల్లో భాగంగా గోవా తీరం నుంచి గాల్లోకి ఎగిరిన ఈ విమానం తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని వదిలేసి సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే ఈ ఘటనపై బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్లు నావికాదళం పేర్కొంది. 2019 నుంచి మిగ్-29కే విమానం కూలడం ఇది నాలుగోసారి. ఈ విమానంలో రష్యాలో తయారు చేసిన కే-36డీ-3.5 ఎజెక్షన్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటిని అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
గోవాలో కుప్పకూలిన మిగ్-29కే
October 12, 2022
0