జనసంద్రంలా మారిన నవీ ముంబై 'లైగర్' ఈవెంట్ !

Telugu Lo Computer
0


స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్రేజ్ షాక్ కు గురిచేస్తోంది. ఆయన పాన్ ఇండియా స్టార్ డమ్ వల్ల ముంబైలో ఏ ఈవెంట్ నిర్వహించినా అక్కడ జనం ప్రవాహంలా వస్తున్నారు. విజయ్ కొత్త సినిమా లైగర్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో ముంబైలో ప్రచార కార్యక్రమాలు జరుపుతున్నారు. అక్కడ ఆదివారం నిర్వహించిన ఈవెంట్‌లో జనాలు తండోపతండాలుగా హాజరయ్యారు.  ఇటీవల లైగర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మల్టీప్లెక్స్ మాల్ మొత్తం నిండిపోగా..తాజాగా నవీ ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. ఈ ఈవెంట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోలకు మించిన క్రేజ్ విజయ్ దేవరకొండకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రౌడ్ వల్ల ఈవెంట్ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రేజ్ తో రేపు లైగర్ భారీ ఓపెనింగ్స్ కు రాబట్టబోతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లైగర్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేట్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాలో కీలకం అని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)