మధుమేహం - బంగాళదుంప

Telugu Lo Computer
0


మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో కొన్ని  కూరగాయలను చేర్చుకోకపోవడం మంచిది. బంగాళదుంపల వినియోగం మధుమేహ రోగుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగాళా దుంపలు చాలా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయన్నట్లు. ఇది కాకుండా బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. మొక్కజొన్న గ్లైసెమిక్ ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. దీనిని తినాలని అనుకుంటే తినాలనుకుంటే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో కలుపుకుని తినండి. బఠానీలలో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయట. అందుకే ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు వీటిని దూరంగా ఉండటం మంచిది. పచ్చి కూరగాయల రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఈ పానీయంలో ఫైబర్ లోపం చాలా ఉంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ జ్యూస్ తాగే బదులు వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది.

Post a Comment

0Comments

Post a Comment (0)